
525views
-
ఉత్తమ ఫలితాలిస్తున్న ఆర్టికల్ 370 రద్దు
-
వెల్లడించిన కేంద్ర హోం శాఖ
న్యూఢిల్లీ: గడిచిన నాలుగేళ్ళలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం 45 శాతం తగ్గిందని కేంద్ర హోంశాఖ పార్లమెంట్లో ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పరిణామాలపై అనేక ఆందోళనలు వ్యక్తం అయినప్పటికీ.. ఉత్తమ ఫలితాలు ఇస్తోంది. అయితే, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన డేటాను కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయి విడుదల చేస్తూ.. ప్రభుత్వ చర్యలు కశ్మీర్లకు మేలు చేశాయని చెప్పారు.





