కరోనా రాకముందు మన దేశం పిపిఇలు ఉత్పత్తి చేయలేదు. ఇపుడు రోజుకు రెండు లక్షలు ఉత్పత్తి చేస్తున్నాము. ఎన్95 మాస్కులు కూడా రెండు లక్షలు తయారవుతున్నాయి.
మన సంస్కృతి వసుధైక కుటుంబకం, సర్వేజన సుఖినోభవంతు అంటుంది.
క్షయ, పోలియో, కుష్టు వంటి వ్యాధులను మనం జయించాం.
కచ్ వంటి భూకంపాల నుంచి కోలుకున్నాము.
మనకు ఏదీ అసంభవం కాదు.
ఈ శతాబ్దం మనది.
భారత్ స్వయం సమృద్ధం కావాలి.
ఆత్మనిర్భర భారత్ ద్వారా అయిదు లక్ష్యాలు సాధిద్దాం.
1. ఎకానమీలొ క్వాంటమ్ జంప్.
2. ఇన్ ఫ్రా స్ట్రక్చర్.
3. టెక్నాలజీ డ్రివెన్ వ్యవస్థలు.
4.రాష్ట్రాల సమగ్రాభివృద్ధి, రాజ్యాంగ స్ఫూర్తి.
5. డిమాండ్ – సప్లై అవకాశాలు. ప్రతి స్టేక్ హోల్డర్ కు మద్దతు.
ప్రతి శ్రమజీవికి అవకాశం రావాలి.
ఒక ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నాము. ఇది ఆత్మ నిర్భరతకు గట్టి మద్దతు ఇస్తుంది.
20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇది.
ప్రతి రంగానికి సపోర్టు లభిస్తుంది. ఇది జిడిపిలో పదోవంతు!
2020 లో 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశానికి గొప్ప ఆర్దిక శక్తినిస్తుంది.
కుటీర పరిశ్రమలు మొదలు, రైతులు, కూలీలు మొదలు భారీ సంస్థల వరకూ సాయపడుతుంది. పన్ను చెల్లింపుదార్లకు అండగా నిలుస్తుంది. ఆర్ధిక మంత్రి రేపటినుంచీ ఈ అంశాలను వివరంగా చెపుతారు.
కరోనాను తట్టుకుంటూ సమర్ధంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.
జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా “జమ్” ఏర్పాటు చేశాం. దాని ఉపయోగం ఇపుడు తెలిసింది. పేదలు ఇంట్లో ఉంటే వారి ఎకౌంట్లొ డబ్బు వేశాం.
స్వయం సమృద్ధి అనేది ఆత్మ విశ్వాసంతొ మాత్రమే సాధ్యం. మన వస్తు నాణ్యత, ఉత్పాదకత పెంచుకుందాం. మన పేద ప్రజలు ఈ కరోనా సమయంలో ఎన్నొ అవస్థల పాలయ్యారు. వారి ఆర్ధికాభివృద్ధికి కృషి జరగాలి. లోకల్ మాన్యఫాక్చర్, లోకల్ సప్లై చైన్, లోకల్ డిమాండ్ పెరగాలి. లోకల్ అనేది మన జీవన మార్గం కావాలి. గ్లోబల్ బ్రాండ్స్ ఒకపుడు లోకలే కదా!
ఇకపై భారతీయులు లోకల్ నే ఓకల్ చేయాలి. లోకలే వాడతామని గర్వంగా చెప్పుకోవాలి. గతంలో ఖాదీ వాడదామనుకున్నాం. అది ఇపుడు సుసాధ్యమైంది కదా!
కరోనా ఇప్పట్లో పోదు.
దాన్ని భరిస్తూ బతకాలి.
లాక్ డౌన్ – 4 పూర్తిగా వేరేగా ఉంటుంది.
ఆ నియమాలను పాటిస్తూ మనం జీవిద్దాం…అభివృద్ధి సాధిద్దాం. నూట ముప్పయి కోట్ల భారతీయుల ప్రాణ శక్తే సంకల్ప శక్తిగా మనం స్వయం సమృద్ధ భారత్ ను తయారు చేద్దామన్న సంకల్పం చెప్పుకుందాం! మీ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం జాగ్రత్త!..
పూర్తిగా జ్ఞానం వికసించని శిశువు సైతం తల్లి పాడే జోలపాటకు ప్రశాంతతను పొందుతుంది. మాటలు లేని మూగజీవాలు కూడా సంగీత ధ్వనులకు స్పందిస్తాయి. సకల చరాచర సృష్టి...
రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రచారంలో భాగంగా ‘ప్లాట్ కొనుగోలు చేస్తే జీవితకాలం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఓ...
గోదావరి కాటన్ ఆనకట్ట పరిధిలోని విజ్జేశ్వరం ఆర్మ్ వద్ద వశిష్ఠ మహర్షి విగ్రహం దిమ్మె ఒకవైపునకు ఒరిగిన ఘటనపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
మహాకావ్యమైన రామాయణం గొప్ప కథనాలకు భాషా పరిమితులు ఉండవని మరోసారి నిరూపించింది. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని పోలాండ్ లోని పోలిష్ నాటక బృందం ప్రత్యేక శైలిలో ప్రదర్శించి...
లండన్లో జూలై 26న నిర్వహించిన SFI UK కార్యక్రమంలో వాతావరణ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ పాల్గొని CJP ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్యం...
భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు అందించడం గురు–శిష్య సంప్రదాయం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య డా. రఘువీర్ గోస్వామి పేర్కొన్నారు....