కరోనా రాకముందు మన దేశం పిపిఇలు ఉత్పత్తి చేయలేదు. ఇపుడు రోజుకు రెండు లక్షలు ఉత్పత్తి చేస్తున్నాము. ఎన్95 మాస్కులు కూడా రెండు లక్షలు తయారవుతున్నాయి.
మన సంస్కృతి వసుధైక కుటుంబకం, సర్వేజన సుఖినోభవంతు అంటుంది.
క్షయ, పోలియో, కుష్టు వంటి వ్యాధులను మనం జయించాం.
కచ్ వంటి భూకంపాల నుంచి కోలుకున్నాము.
మనకు ఏదీ అసంభవం కాదు.
ఈ శతాబ్దం మనది.
భారత్ స్వయం సమృద్ధం కావాలి.
ఆత్మనిర్భర భారత్ ద్వారా అయిదు లక్ష్యాలు సాధిద్దాం.
1. ఎకానమీలొ క్వాంటమ్ జంప్.
2. ఇన్ ఫ్రా స్ట్రక్చర్.
3. టెక్నాలజీ డ్రివెన్ వ్యవస్థలు.
4.రాష్ట్రాల సమగ్రాభివృద్ధి, రాజ్యాంగ స్ఫూర్తి.
5. డిమాండ్ – సప్లై అవకాశాలు. ప్రతి స్టేక్ హోల్డర్ కు మద్దతు.
ప్రతి శ్రమజీవికి అవకాశం రావాలి.
ఒక ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నాము. ఇది ఆత్మ నిర్భరతకు గట్టి మద్దతు ఇస్తుంది.
20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇది.
ప్రతి రంగానికి సపోర్టు లభిస్తుంది. ఇది జిడిపిలో పదోవంతు!
2020 లో 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశానికి గొప్ప ఆర్దిక శక్తినిస్తుంది.
కుటీర పరిశ్రమలు మొదలు, రైతులు, కూలీలు మొదలు భారీ సంస్థల వరకూ సాయపడుతుంది. పన్ను చెల్లింపుదార్లకు అండగా నిలుస్తుంది. ఆర్ధిక మంత్రి రేపటినుంచీ ఈ అంశాలను వివరంగా చెపుతారు.
కరోనాను తట్టుకుంటూ సమర్ధంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.
జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా “జమ్” ఏర్పాటు చేశాం. దాని ఉపయోగం ఇపుడు తెలిసింది. పేదలు ఇంట్లో ఉంటే వారి ఎకౌంట్లొ డబ్బు వేశాం.
స్వయం సమృద్ధి అనేది ఆత్మ విశ్వాసంతొ మాత్రమే సాధ్యం. మన వస్తు నాణ్యత, ఉత్పాదకత పెంచుకుందాం. మన పేద ప్రజలు ఈ కరోనా సమయంలో ఎన్నొ అవస్థల పాలయ్యారు. వారి ఆర్ధికాభివృద్ధికి కృషి జరగాలి. లోకల్ మాన్యఫాక్చర్, లోకల్ సప్లై చైన్, లోకల్ డిమాండ్ పెరగాలి. లోకల్ అనేది మన జీవన మార్గం కావాలి. గ్లోబల్ బ్రాండ్స్ ఒకపుడు లోకలే కదా!
ఇకపై భారతీయులు లోకల్ నే ఓకల్ చేయాలి. లోకలే వాడతామని గర్వంగా చెప్పుకోవాలి. గతంలో ఖాదీ వాడదామనుకున్నాం. అది ఇపుడు సుసాధ్యమైంది కదా!
కరోనా ఇప్పట్లో పోదు.
దాన్ని భరిస్తూ బతకాలి.
లాక్ డౌన్ – 4 పూర్తిగా వేరేగా ఉంటుంది.
ఆ నియమాలను పాటిస్తూ మనం జీవిద్దాం…అభివృద్ధి సాధిద్దాం. నూట ముప్పయి కోట్ల భారతీయుల ప్రాణ శక్తే సంకల్ప శక్తిగా మనం స్వయం సమృద్ధ భారత్ ను తయారు చేద్దామన్న సంకల్పం చెప్పుకుందాం! మీ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం జాగ్రత్త!..
గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి స్వయం సహాయక సంఘాలు. ఉపాధి కల్పిస్తూనే వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్నీ నింపుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని సెరిఖేడికి చెందిన...
ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే...
సమాజంలో ప్రతిఒక్కరూ నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవాలని, తద్వారా అన్ని రంగాలు ఉన్నతంగా విలసిల్లుతాయని ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మానవుడికి ఓర్పును మించిన...
ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పీడించిన నక్సలిజం అంతమైందని కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత జిల్లా ఏదీ లేదని కేంద్ర హోం...
గతేడాది దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకొన్న ఆత్మాహుతి దాడితో బయటపడిన ‘డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ ’ తీవ్ర కలకలం రేపింది. ఈ ఉగ్ర నెట్వర్క్పై...
దేశవ్యాప్తంగా కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్లోని బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసు అనూహ్య మలుపు...