కరోనా రాకముందు మన దేశం పిపిఇలు ఉత్పత్తి చేయలేదు. ఇపుడు రోజుకు రెండు లక్షలు ఉత్పత్తి చేస్తున్నాము. ఎన్95 మాస్కులు కూడా రెండు లక్షలు తయారవుతున్నాయి.
మన సంస్కృతి వసుధైక కుటుంబకం, సర్వేజన సుఖినోభవంతు అంటుంది.
క్షయ, పోలియో, కుష్టు వంటి వ్యాధులను మనం జయించాం.
కచ్ వంటి భూకంపాల నుంచి కోలుకున్నాము.
మనకు ఏదీ అసంభవం కాదు.
ఈ శతాబ్దం మనది.
భారత్ స్వయం సమృద్ధం కావాలి.
ఆత్మనిర్భర భారత్ ద్వారా అయిదు లక్ష్యాలు సాధిద్దాం.
1. ఎకానమీలొ క్వాంటమ్ జంప్.
2. ఇన్ ఫ్రా స్ట్రక్చర్.
3. టెక్నాలజీ డ్రివెన్ వ్యవస్థలు.
4.రాష్ట్రాల సమగ్రాభివృద్ధి, రాజ్యాంగ స్ఫూర్తి.
5. డిమాండ్ – సప్లై అవకాశాలు. ప్రతి స్టేక్ హోల్డర్ కు మద్దతు.
ప్రతి శ్రమజీవికి అవకాశం రావాలి.
ఒక ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నాము. ఇది ఆత్మ నిర్భరతకు గట్టి మద్దతు ఇస్తుంది.
20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇది.
ప్రతి రంగానికి సపోర్టు లభిస్తుంది. ఇది జిడిపిలో పదోవంతు!
2020 లో 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశానికి గొప్ప ఆర్దిక శక్తినిస్తుంది.
కుటీర పరిశ్రమలు మొదలు, రైతులు, కూలీలు మొదలు భారీ సంస్థల వరకూ సాయపడుతుంది. పన్ను చెల్లింపుదార్లకు అండగా నిలుస్తుంది. ఆర్ధిక మంత్రి రేపటినుంచీ ఈ అంశాలను వివరంగా చెపుతారు.
కరోనాను తట్టుకుంటూ సమర్ధంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.
జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా “జమ్” ఏర్పాటు చేశాం. దాని ఉపయోగం ఇపుడు తెలిసింది. పేదలు ఇంట్లో ఉంటే వారి ఎకౌంట్లొ డబ్బు వేశాం.
స్వయం సమృద్ధి అనేది ఆత్మ విశ్వాసంతొ మాత్రమే సాధ్యం. మన వస్తు నాణ్యత, ఉత్పాదకత పెంచుకుందాం. మన పేద ప్రజలు ఈ కరోనా సమయంలో ఎన్నొ అవస్థల పాలయ్యారు. వారి ఆర్ధికాభివృద్ధికి కృషి జరగాలి. లోకల్ మాన్యఫాక్చర్, లోకల్ సప్లై చైన్, లోకల్ డిమాండ్ పెరగాలి. లోకల్ అనేది మన జీవన మార్గం కావాలి. గ్లోబల్ బ్రాండ్స్ ఒకపుడు లోకలే కదా!
ఇకపై భారతీయులు లోకల్ నే ఓకల్ చేయాలి. లోకలే వాడతామని గర్వంగా చెప్పుకోవాలి. గతంలో ఖాదీ వాడదామనుకున్నాం. అది ఇపుడు సుసాధ్యమైంది కదా!
కరోనా ఇప్పట్లో పోదు.
దాన్ని భరిస్తూ బతకాలి.
లాక్ డౌన్ – 4 పూర్తిగా వేరేగా ఉంటుంది.
ఆ నియమాలను పాటిస్తూ మనం జీవిద్దాం…అభివృద్ధి సాధిద్దాం. నూట ముప్పయి కోట్ల భారతీయుల ప్రాణ శక్తే సంకల్ప శక్తిగా మనం స్వయం సమృద్ధ భారత్ ను తయారు చేద్దామన్న సంకల్పం చెప్పుకుందాం! మీ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం జాగ్రత్త!..
తాలిబన్ పాలకులు అఫ్గానిస్థాన్లో మహిళలపై విధించిన కఠిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని, దేశంలో తీవ్రవాదులను నియంత్రించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. 2027 జూన్...
పాకిస్థాన్లో ప్రజాస్వామ్య పాలన అనేది కేవలం ఒక ప్రహసనమని.. అక్కడ తెరవెనుక అంతా సైన్యం, నిఘా సంస్థల మాటే నడుస్తుందని అంతర్జాతీయ సమాజం ఎప్పటి నుంచో చెబుతున్న...
ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లోని గైబందా జిల్లాలో కొందరు ఇస్లామిస్ట్ కార్యకర్తలు శ్రీరాముడి చిత్రపటంపై చెప్పులు విసిరి అవమానించారు. ఈ...
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ఉగ్రవాద-నేరపూరిత ముఠా గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్...
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోట నాగవరం గ్రామంలో రైతుల సమక్షంలో ఘన జీవామృతం తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన...
మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో నిర్వహించిన “ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత” కార్యక్రమంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము, అభివృద్ధికి మరియు సాంప్రదాయ విలువలకు...