News

చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన

169views
  • అసోం- అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ 9.15 కి.మి మేర నిర్మాణం

న్యూఢిల్లీ: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు నిలుస్తోంది. అసోం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా తోడ్పడుతుందన్న భావనతో ఈ వంతెనను నిర్మించారు.

60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా ప‌టిష్ఠంగా తీర్చిదిద్దారు. భారత సైన్యంలోని అర్జున్‌, టీ-72 వంటి యుద్ధ ట్యాంకులను ఈ వంతెన ద్వారా సరిహద్దుకు సులువుగా తరలించవచ్చు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ చైనా పదే పదే కవ్వింపులకు పాల్పడుతోంది. కీలకమైన సమయాల్లో మన సైనికులను సత్వరమే తరలించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి