News

నరసరావుపేటలో వైభ‌వంగా శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణోత్స‌వం

542views

నరసరావుపేట: ఏపీలోని ప‌ల్నాడు జిల్లా, నరసరావుపేటలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. లోకకల్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా వంటి మహమ్మారి మరెప్పుడూ ఈ ప్రపంచంలో కనపడకూడదని ఆకాంక్షిస్తూ స్థానిక భ‌క్తుల సాయంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

అర్చ‌కుడు పరాంకుశం రంగనాధాచార్యులు సుమారు 200 మంది దంపతులచే, వేలమంది భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వ‌హించారు. స్థానికి వాస‌వి మార్కెట్ వ‌ద్ద జ‌రిగిన ఈ కార్యక్రమానికి వీహెచ్‌పీ ప్రాంత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ టి. శివశంకర్ పాల్గొని, పరిషత్ ముఖ్య ఉద్దేశాలు, రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్‌(ఆర్.ఎస్.ఎస్) పల్నాడు జిల్లా సంఘచాలక్ మాన్యశ్రీ కొత్త వెంకట రామకృష్ణ ఈ క‌ల్యాణోత్స‌వం జ‌రిపేందుకు గల కారణాలను భక్తులకు వివ‌రించారు. భగవంతుడిని నవవిధాలుగా పూజించవచ్చని తెలిపారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు భాగవతుల రవికుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి