News

కన్నూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌పై బాంబు దాడి!

651views

తిరువ‌నంత‌పురం: కేరళలోని కన్నూర్​ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పయ్యనుర్​లోని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్​(ఆర్​ఎస్ఎస్​) కార్యాలయంపై బాంబు విసిరారు. ఈ ఘటన తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని, కానీ గాయాలు కాకుండా తప్పించుకున్నారని పోలీసుల తెలిపారు. ఈ దాడిలో కార్యాలయ కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి