News

బీహార్‌లో హిందూ వివాహిత‌కు ముస్లిం వేధింపులు.. ప్ర‌శ్నించినందుకు కుటుంబ స‌భ్యుని హ‌త్య‌!

579views

బీహార్: బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ముస్లిం యువ‌కుడు మహ్మద్ అజ్లాం నదాఫ్ హిందూ వివాహిత‌ను నిత్యం వేధిస్తున్నాడు. ఇదేమ‌ని ప్ర‌శ్నించినందుకు ఇత‌ర ముస్లింల‌తో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో ఒక మహిళ స‌హా న‌లుగురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు.

ఈ ఘటన ఘనశ్యాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడియా తోల్‌లో చోటుచేసుకుంది. భర్త, అత్తమామలకు ఫోన్ చేస్తూ నదాఫ్ ఆ మహిళను వెంబడించి వేధించేవాడు. ఈ విషయాన్ని అత్తామామలు ఆమె తండ్రికి తెలిపారు.

బాధిత మహిళ మేనమామలు ధర్మకుమార్, ఇందల్ కుమార్, సోదరుడు సూరజ్ కుమార్ బుధవారం తమ ఇంటి బయట కూర్చున్నారు. ఆ ప్రాంతంలో మ‌ళ్ళీ తిరుగుతున్న నదాఫ్‌ను గమనించి తమ కుమార్తెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని ప్రశ్నించారు. దీంతో వాగ్వివాదం జ‌రిగింది. కొంత సమయం తర్వాత ఎం.డి నదాఫ్ దాదాపు డజను మంది కుటుంబ సభ్యులు, పరిచయస్తులతో తిరిగి వచ్చాడు. వీరిలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. మున్నీ ఖాటూన్, ముస్లిం నజాఫ్, నజీర్ నజాఫ్, ఎం.డి అష్రఫ్, ఎం.డి అస్లాం, జులేఖా ఖాతూన్, ఛోట్టే నదాఫ్ , సోబ్రా ఖాటూన్, సకీలా ఖాటూన్, ప్రమీలా ఖాటూన్, ఎం.డి రెహ్మతుల్లా త‌దిత‌రులు ఉన్నారు.

కర్రలు, ఇతర ఆయుధాలతో ఈ గుంపు ముగ్గురి హిందూ పురుషులపై క్రూరంగా దాడి చేసింది. ధర్మ కుమార్‌ను చంపేస్తానని అజ్మల్ బెదిరించాడు. బాధితులను తీవ్రంగా గాయపరిచిన తర్వాత, ఆ సమూహం వెళ్ళిపోయింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, ఆపై దర్భంగా మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే, ధర్మ కుమార్ చికిత్స పొందుతూ మరణించగా, ఇందల్, సూరజ్ పరిస్థితి విషమంగా ఉంది.

గురువారం ధర్మకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకురావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టపరిహారం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ రోడ్డును దిగ్బంధించారు. మృతుడి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడి ఇంటిని కూడా తగులబెట్టారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి