
525views
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా మరో రికార్డ్ సృష్టించాడు. జాతీయ రికార్డును నమోదు చేశాడు. ఫిన్లాండ్ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్లో 89.30 మీటర్లు బల్లెం విసిరి ఈ ఫీట్ నమోదు చేశాడు. గతేడాది మార్చిలో పటియాలా వేదికగా 88.07, టోక్యో ఒలింపిక్స్లో 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. కాగా, ప్రస్తుత ఈవెంట్లో అతడి రజత పతకం దక్కింది. తొలి రౌండ్ను 86.92 మీటర్లతో ప్రారంభించిన అతడు.. తర్వాత మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 85.85 మీటర్లు విసిరాడు.





