
442views
అమరావతి: టీటీడీ నేతృత్వంలో అమరావతిలో నూతనంగా చేపట్టిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దేవస్థానం ప్రారంభోత్సవాన్ని ఈ నెల 4న నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలూ ప్రారంభం కానున్నాయి. 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.





