News

హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌

439views

దేశ రాజధాని నగరం ఢిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్ జైన్ ‌ను ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు.

కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.