
406views
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న జపాన్లోని టోక్యోలో జరగనున్న క్వాడ్ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని తెలిపింది.





