News

పాక్‌కు చదువు పేరుతో వెళ్ళి ఉగ్రవాదులుగా మారుతున్న క‌శ్మీర్ యువత

569views
  • 17 మంది కాల్చివేత

న్యూఢిల్లీ: అధికారిక వీసాలపై పాకిస్తాన్‌కు వెళ్ళి తిరిగి లోయలోకి చొరబడిన 17 మంది క‌శ్మీరీ యువకులు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో మరణించారు. లోయలో రెచ్చగొడుతున్న ఉగ్రవాదాన్ని స్వదేశీ ఉద్యమంగా చిత్రీకరించడానికి ఐఎస్ఐ కొత్త పద్ధతిని అవలంబించిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2015 నుండి, పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నత చదువులు చదవడానికి, బంధువులను కలవడానికి లేదా వివాహ ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌కు వెళ్ళ‌డానికి వీసాలను అధికారిక మార్గాలలోనే పొందుతున్నారు.

ఇటీవల, యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్, దేశంలోని ఉన్నత, సాంకేతిక విద్యా నియంత్రణ సంస్థలైన ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం పాకిస్తాన్‌కు వెళ్ళ‌వద్దని హెచ్చరించింది.

“పాకిస్తాన్‌లోని ఏదైనా డిగ్రీ కళాశాల/విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే భారతీయ జాతీయుడు/భారతదేశపు విదేశీ పౌరుడు, పాకిస్తాన్‌లో పొందిన విద్యార్హతల (ఏదైనా సబ్జెక్ట్‌లో) ఆధారంగా భారతదేశంలో ఉద్యోగం లేదా ఉన్నత చదువులు కోరుకోవడానికి అర్హులు కారు” అని యుజిసి, ఎఐసిటిఇ ఓ సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి.

ఈ యువకులను సరిహద్దు దాటించి, బ్రెయిన్‌వాష్ చేసి, వారిలో కొందరికి ఆయుధ శిక్షణ ఇవ్వడం లేదా మనీలాండరింగ్‌కు ఉపయోగించుకోవడం వాటి చర్యలకు ఐఎస్ఐ పాల్పడటమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది.

అక్క‌డి కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను విక్రయించి, వచ్చిన మొత్తాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించినందుకు జమ్మూ క‌శ్మీర్ పోలీస్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఎ).. హురియత్ నాయకుడు, ఇతరులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి