-
హెచ్చరించిన నిఘా విభాగం
న్యూఢిల్లీ: వచ్చే రెండు వారాల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో మావోలు భారీ చర్యలకు ఉపక్రమించవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి.
వీటితో పాటు మావోయిస్టు ప్రభావితం ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్ర నిఘా విభాగం-ఐబి వర్గాల హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. మావోయిస్టుల దాడికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని.. నాలుగు రాష్ట్రాల అధికారులకు పంపినట్టు నిఘా వర్గాల అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసు తీవ్రత దృష్ట్యా నాలుగు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. తగిన వ్యూహాన్ని రచించే పనిలో నిమగ్నమవ్వాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలు కూడా మావోయిస్టు కదలికలపై నిరంతర పర్యవేక్షణ పెంచినట్టు అధికారులు వెల్లడించారు.
Source: EtvBharat