
నాగావ్: మధ్య అసోం జిల్లా నాగావ్ ముస్లిం నేరగాళ్ళ అక్రమాలకు కేంద్రంగా మారింది. గత 12 నెలల్లో, వివిధ నేరాలలో పాల్గొన్న వేలాది మంది నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. నాగావ్ పోలీసులు గత కొన్ని నెలలుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 600 మందికి పైగా మాదకద్రవ్యాల వ్యాపారులను, 100 మందికి పైగా ఆవు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
ఇంకా, ఈ జిల్లా నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల (ఎఫ్ఐసిఎన్) వ్యాపారానికి కేంద్రంగా మారింది. మంగళవారం (ఏప్రిల్ 26) ఎఫ్ఐసిఎన్లో వ్యాపారం చేస్తున్న ముక్తాదుల్ ఇస్లాం, ఫైజుల్ ఇస్లాం అనే ఇద్దరు నేరస్తులను నాగోన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు బృందం ఒక ఎఫ్ఐసిఎన్ ప్రింటింగ్ మెషిన్, 500 డినామినేషన్ కలిగిన 327 ఎఫ్ఐసిఎన్ ముక్కలను స్వాధీనం చేసుకుంది.
నిందితులు నకిలీ కరెన్సీలను ముద్రించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇటువంటి రాకెట్ల ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Source: Organiser





