News

ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

530views

ఢిల్లీ: ఢిల్లీలోని గాజీపుర్​ ప్రాంతంలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. మృతుడు మయూర్​ విహార్​ జిల్లా యూనిట్​కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వ‌హిస్తున్నాడు. ఇత‌ను జీతూ చౌదరీగా పోలీసులు గుర్తించారు.

ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోలీసుల వివరాలు ప్రకారం.. మయుర్​ విహార్​ ప్రాంతంలో నివసించే జీతూ చౌదరీ బుధవారం రాత్రి తన ఇంటి బయటకు వచ్చి నిల్చున్నాడు. అదే సమయంలో బైక్​పై ఇద్దరు దుండగులు వచ్చి జీతూపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.

ఈ క్రమంలో తల, కడుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటన రాత్రి సుమారు 8.15 గంటలకు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు గురైన జీతూను అక్కడి స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి