News

మధ్యప్రదేశ్ ఖార్గోన్ ఘటనలో ఇస్లాం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ హస్తం

657views

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ సిటీలో హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ పేర్కొన్నారు. దీనిని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) స్పాన్సర్ చేసిందని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం శాంతియుత రాష్ట్రమని, అటువంటి రాష్ట్రంలో ఊరేగింపుపై దాడి జరిగితే అది పీఎఫ్ఐ వంటి సంస్థల ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర అని సూచిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని శర్మ డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి