
న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్లో తెలిపారు.
ఆగస్టు 2019లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదాను రద్దు చేయడానికి ముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని స్థిరాస్తులను కొనుగోలు చేయకుండా ప్రవాసులను నిషేధించారు. కేంద్రం భూమి నిబంధనలను మార్చింది. బయటి వ్యక్తులు దానిని కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేయడానికి ఈ ప్రాంతంలోని భూమికి సంబంధించిన జమ్మూకశ్మీర్ డెవలప్మెంట్ చట్టంలోని సెక్షన్ 17 నుంచి “రాష్ట్రంలో శాశ్వత నివాసి” అనే పదబంధాన్ని తొలగించింది. ఈ ప్రాంతంలో శాశ్వత నివాసితులు లేదా నివాసాలు కాని వ్యక్తులకు కూడా వ్యవసాయేతర విక్రయాలు ఇప్పుడు అనుమతిస్తున్నారు.
Source: Nijamtoday





