News

ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న రాష్ట్రపతి

603views

విశాఖ‌ప‌ట్నం: సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖలో జరుగుతున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలో ప్రయాణిస్తూ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు.

రాష్ట్రపతి ప్రయాణించే నౌకకు ముందూ.. వెనుక పైలెట్ నౌకలు ప్రయాణిస్తున్నాయి. రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తూ ఫ్లీట్ రివ్యూలో యుద్ధనౌకల విన్యాసాలు సాగుతున్నాయి. గగనతలంలోనూ రామ్‌నాథ్‌ కోవింద్​కు సెల్యూట్‌ చేస్తూ ఎయిర్‌క్రాఫ్టులు చేస్తున్న విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ విన్యాసాల్లో 10 వేలమందికి పైగా నావికా సిబ్బంది పాల్గొన్నారు.

సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఈసారి రివ్యూ చేస్తున్నారు. మిలన్‌-2022 పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు జాతీయ ఓషణోగ్రఫీకి చెందిన నౌకలు పాల్గొన్నాయి. జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భాగం పంచుకున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి