News

హనుమంతుని జన్మవృత్తాంతంపై టీటీడీ పుస్తకం

508views

తిరుప‌తి: తిరుమల ఆకాశగంగ సమీపంలో శ్రీ ఆంజనేయస్వామివారి జన్మవృత్తాంతంపై ఈనెల 16న పుస్తకాన్ని ఆవిష్కరించనున్నామని టీటీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. అదే రోజు అంజనాద్రిలో హనుమంతుడి జన్మస్థలం వద్ద చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తామని వెల్లడించారు. భూమిపూజ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా అంజనాదేవి, బాల ఆంజనేయస్వామివారి ఆలయం ఎదురుగా ముఖమండపం, గోపురాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు నాగేశ్వరరావు, మురళీకృష్ణ ఆర్థికసాయంతో ప్రముఖ సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టనున్నట్టు వివరించారు. తరిగొండ వెంగమాంబ బృందావనంలోని ఎకరన్నర స్థలంలో ధ్యానమందిరం, ఉద్యానవనం నిర్మాణానికి కార్యాచరణ రూపొందించి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నామన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి