News

హిజాబ్ ర‌గ‌డ‌… క‌ర్ణాట‌క‌లో నిలిచిన త‌ర‌గ‌తులు

606views

విజయపుర(క‌ర్ణాట‌క‌): క‌ర్ణాట‌క‌ విద్యాసంస్థల్లో హిజాబ్ ర‌గ‌డ‌ నేపథ్యంలో కొందరు విద్యార్థులు క‌షాయ రంగు కండువాలు ధ‌రించి క్యాంపస్‌కు రావడంతో సోమవారం విజయపురలోని శాంతేశ్వర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో తరగతులు నిలిపివేశారు.

అందరినీ సమానంగా చూడాలని ప్రభుత్వం ఆదేశించడం స్వాగతించదగ్గ పరిణామమని, అందుకే మా అన్నదమ్ములకు మద్దతుగా క‌షాయ రంగు కండువాల‌తో ఇక్కడికి వచ్చామని కుంకుమ బొట్టు పెట్టుకుని కళాశాలకు వచ్చిన విద్యార్థిని ఒకరు తెలిపారు.

కర్నాటకలో హిజాబ్‌లు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ కళాశాలల విద్యార్థులు క‌షాయ రంగు కండువాలు ధరించి కళాశాలలకు వెళ్తున్నారు. ఇటువంటి వారు తరగతి గదుల్లో హిజాబ్ ధరించాలని పట్టుబడుతున్న వారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కర్నాటకలోని విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌ మాట్లాడుతూ క‌షాయ రంగు కండువాలు, హిజాబ్ ధ‌రిస్తే తరగతి గదిలోకి అనుమతించబోమని చెప్పారు.

కాగా, కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర ప్రాంతంలోని ప్రభుత్వ పీయూ కళాశాల క్యాంపస్‌లోకి సోమవారం హిజాబ్ ధరించిన విద్యార్థులను అనుమతించారు. అయితే, అలాంటి విద్యార్థులను ప్రత్యేక తరగతి గదుల్లో కూర్చోబెడతామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

“కుందాపురలో పరిస్థితి అదుపులో ఉందని, విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలలకు, క్యాంపస్‌లకు రావడానికి అనుమతిస్తున్నారు. కుందాపూర్‌లో శాంతిభద్రతల స‌మ‌స్య‌ లేదు” అని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సిద్దలింగప్ప అన్నారు.

ఇదిలావుండ‌గా, విద్యార్థులు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన యూనిఫాం మాత్రమే ధరించాలని, కాలేజీల్లో ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించబోమని శనివారం ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ బోర్డు సర్క్యులర్ విడుదల చేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి