News

రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌తో అక్త‌ర్‌, న‌జీర్‌ అరెస్టు!

581views

పాల్ఘర్​: మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలో రూ.5 కోట్లు విలువైన హెరాయిన్​ దొరికింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రగ్స్​ వ్యాపారులు మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం(ఏటీఎస్​) అరెస్ట్​ చేసింది.

వసయీ ప్రాంతంలోని పెల్హార్​ గ్రామంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఏటీఎస్​ అధికారులు.. తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 1.724 కిలోల హెరాయిన్​ పట్టుబడింది. దీంతో పాటు రూ.2,60,000 నగదు, రెండు మొబైల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు.

షూ రవాణా ముసుగులో డ్రగ్స్​..

ఈ ఘటనకు సంబంధించి అధికారులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్​ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఆ ఇద్దరు నిందితులను ఉత్తరాఖండ్​కు చెందిన అలీమ్​ మహ్మద్​ అక్తర్​(30), చోటా మహ్మద్​ నజీర్​(40)లుగా గుర్తించారు. వారిని విచారించగా కొత్త బూటుల్లో రాజస్థాన్​ నుంచి ముంబయికి డ్రగ్స్​​ రవాణా చేస్తున్నట్టు చెప్పారని అధికారులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 15 వరకు తమ​ కస్టడీకి పంపినట్టు ఏటీఎస్​ తెలిపింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి