News

కర్ణాటకలో రామభక్తుల 350 కి.మీ. పాదయాత్ర

523views

బెంగళూరు: యోగి ఆదిత్యనాథ్‌ మరోసారి ఉత్తర‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గెలుపొందాలని కర్ణాటకకు చెందిన కొంతమంది రామభక్తులు పాదయాత్ర చేపట్టారు. బెంగళూరు సమీపంలోని హూడి గ్రామానికి చెందిన 25 మంది దక్షిణ కన్నడ జిల్లాలోని శ్రీధర్మస్థల మంజునాథేశ్వర స్వామి ఆలయం వరకు 320 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు.

యూపీలో బీజేపీ 320 స్థానాల్లో విజయం సాధించి, యోగీ ఆదిత్యనాథ్‌ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. అందుకే 320 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టినట్టు చెప్పారు. 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. శ్రీరాముడిని గౌరవించే ప్రతి వ్యక్తికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అయోధ్య‌లో రామమందిర నిర్మాణానికి పునాది వేసిన బీజేపీ గెలుపుకోసం పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి