
536views
అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్హెచ్ మిరాం తరోన్ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్ చేశారు.
చైనా సైనికుల చెరనుంచి తప్పించుకున్న తరోన్ స్నేహితుడు.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినట్టు తెలిపారు. యువకుడిని త్వరగా విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగినట్టు తాపిర్ తెలిపారు. ఇదే ప్రాంతంలో చైనా 2018లో 3-4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించింది.





