
-
‘సానుకూలంగా’ ఉండి సంపాదించుకోండి…
-
వివాదస్పదమైన బెంగాల్ సీఎం వ్యాఖ్య
కోల్కతా: వార్తా పత్రికల విధి ప్రజలపక్షాన ఉండడం. సమాజానికి ఏ వర్గం నుంచి హాని ఉన్నా ఆ వర్గాన్ని తమ ‘కలం’తో సరిదిద్దడానికి ప్రయత్నించడం… అయితే, ఇటువంటి పత్రికలకే ఎర వేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఏకంగా భారీ ఆఫర్ను ప్రకటించారు. తమ ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలు రాయండని పిలుపునిచ్చారు.
West Bengal Chief Minister Mamata Banerjee has triggered massive controversy after she urged local newspapers to publish “positive” news if they want to earn government ads. #MamataBanerjee #WestBengal
Read Here: https://t.co/5kMdGvSaHa pic.twitter.com/cEecFDs3pv
— Organiser Weekly (@eOrganiser) December 8, 2021
స్థానిక వార్తాపత్రికలు ప్రభుత్వ ప్రకటనలను సంపాదించాలనుకుంటే ‘సానుకూల’ వార్తలను ప్రచురించాలని ఆమె కోరారు. దీంతో ఆ రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగింది. మమతా విలేఖర్లతో మాట్లాడుతూ.. తనకు ప్రతికూల వార్తలు అక్కర్లేదని, ప్రచురణకర్తలు తమ ప్రచురణలను జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమర్పించాలని ఆమె అన్నారు. మీరు సానుకూలంగా లేదా ప్రతికూలంగా వార్తలు రాస్తున్నారా? లేదా? అని నిర్ధారించిన తర్వాత ప్రభుత్వ ప్రకటనల విషయమై నేను డీఎంకి చెబుతాను అని మమతా చెప్పారు. తమ గ్రామీణ వార్తాపత్రికకు ప్రభుత్వం నుంచి ప్రకటనలు రావడం లేదని స్థానిక జర్నలిస్టు చెప్పడంతో సీఎం నుంచి పై వివాదాస్పద స్పందన వచ్చింది.
Source: Organiser





