
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం, దంతేవాడ జిల్లా భాన్సీ, కమలూర్ మధ్యలో మావోయిస్టులు రైలు పట్టాలు తొలగించారు. దీంతో కిరండోల్ నుండి విశాఖపట్నంకి ఐరన్ ఓర్ లోడుతో వెళుతున్న రైలు పట్టాలు తప్పి 20 బోగీలు పడిపోయాయి. సాయుధులైన మావోయిస్టులు 50 నుండి 60 మంది భారీ పేలుడు పదార్థాలతో పేల్చినట్టు అధికారులు చెబుతున్నారు. తరువాత రైల్వే సిబ్బంది వద్ద ఉన్న వాకీ టాకీలను తీసుకుని వారిని వదిలిపెట్టారు. బంద్ పిలుపు నేపథ్యంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు. రైలు ఇంజిన్కు పోస్టర్, బ్యానర్ కట్టారు.
-
సర్పంచ్ భర్త హత్య!
ఇదిలావుండగా, అటు నారాయణ్ పూర్ జిల్లా ఫరస్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మారి పంచాయతి సర్పంచ్ భర్త బిర్జురామ్ సాలంను మావోయిస్టులు కత్తులతో పొడిచి చంపారు. గ్రామంలో బీభత్సం సృష్టించి జేసీబీని తగులబెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రముఖుల ఇళ్ల వద్ద భద్రత కట్టదిట్టం చేశారు.
Source: Tv9