News

దేశంలో కొవిడ్ తగ్గుదల

210views
  • కేరళలో ఉద్ధృతం, ఒకే రోజు 388 మంది మృతి

తిరువ‌నంత‌పురం: దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే కేరళలో మాత్రం వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం కొత్తగా 6,849 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. ఒక్కరోజే 388 మంది మరణించటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50, 77,984కు, మరణాల సంఖ్య 36,475కు చేరింది. మొత్తం 69,334 నమూనాలు పరీక్షించగా.. అత్యధికంగా ఎర్నాకులం జిల్లాలో 958, ఆ తర్వాత కోజికోడ్​లో 932, తిరువనంతపురంలో 839 కేసులు వెలుగుచూశాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి