210
-
కేరళలో ఉద్ధృతం, ఒకే రోజు 388 మంది మృతి
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే కేరళలో మాత్రం వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం కొత్తగా 6,849 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఒక్కరోజే 388 మంది మరణించటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50, 77,984కు, మరణాల సంఖ్య 36,475కు చేరింది. మొత్తం 69,334 నమూనాలు పరీక్షించగా.. అత్యధికంగా ఎర్నాకులం జిల్లాలో 958, ఆ తర్వాత కోజికోడ్లో 932, తిరువనంతపురంలో 839 కేసులు వెలుగుచూశాయి.