News

ముస్లిం యువతను ఉగ్రవాదులుగా మారుస్తున్న కేరళవాసి

191views
  • దోషిగా తేల్చిన కోర్టు

తిరువ‌నంత‌పురం: ఉగ్రవాద సంస్థ ఐఎస్​ఐఎస్(ఐసిస్)​లో చేరిన 14 మంది కేరళ యువకుల కేసులో ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టు నషీదుల్​ హమ్జాఫర్​ అనే నిందితుడిని దోషిగా తేల్చింది. కేరళలోని ఎర్నాకులంలో బుధవారం జరిగిన విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. దోషికి విధించే శిక్షపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది. కాసరగోడ్​ జిల్లాకు చెందిన నషీదుల్​ హమ్జాఫర్, రషీద్​ అబ్దుల్లా, అష్​ఫక్​ మజీద్​ సహా పలువురు నిందితులతో 2017 అక్టోబరు 3న విదేశాలకు వెళ్లిన హమ్జాఫర్​ కాబుల్​లో పట్టుబడ్డాడు. 2018 సెప్టెంబరులో ఎన్​ఐఏ హమ్జాఫర్​ను అరెస్ట్​ చేసి భారత్​కు తీసుకువచ్చింది. ​

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి