
-
తమిళనాడులో ఏర్పాటుచేసిన భారత ఆహార సంస్థ
చెన్నై: తమిళనాడు తంజావూరులోని దేశంలోనే తొలి ఆహార మ్యూజియం నిర్మించారు. ఎఫ్సీఐ బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలాజికల్ మ్యూజియం సంయుక్తంగా దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడి వివిధ విభాగాలు ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేలా ఉన్నాయి. దేశంలో రైతు నుంచి ఎఫ్సీఐ గోదాముల వరకూ జరిగే ఆహార సేకరణ ప్రక్రియను వర్చువల్ రియాలిటీ ద్వారా వీక్షించే సౌకర్యం కల్పించారు. ఆహార నిల్వలపై ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు క్విజ్ జోన్ ఏర్పాటుచేశారు.
స్వాతంత్య్రం వచ్చాక ఆహార నిల్వల కోసం ఎఫ్సీఐ సాగించిన ప్రయాణాన్ని డిజిటల్ గ్యాలరీల ద్వారా ప్రదర్శిస్తున్నారు. పూర్వం ఆహారాన్ని భద్రపర్చుకోవడం కష్టంగా ఉండేది. నాటి నుంచి నేటి వరకు ఇందులో వచ్చిన మార్పులను ఇక్కడ తెలుసుకోవచ్చు. సాంకేతిక హంగులతో ఆ నాగరికత కళ్లకు కట్టేలా ఆకృతులు చేశారు. ఏఏ కాలాల్లో ఎలాంటి నిర్మాణాలు, ఎలాంటి వ్యవసాయ పద్థతులు ఉండేవో స్పష్టంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయ నేపథ్యం ఈ రంగంలో వచ్చిన మార్పుల్ని ప్రదర్శనకు ఉంచారు.
పూర్వ వ్యవసాయ పద్ధతుల్లో వాడిన పరికరాలు, వాటి ప్రత్యేకతల్ని నమూనాల ద్వారా చూపించారు. పూర్వం ఆహారం కోసం వేట మొదలు.. వ్యవసాయం వైపు మొగ్గుచూపిన తీరును స్వయంగా చూసి తెలుసుకోవచ్చు. వ్యవసాయంలో చీడపీడలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏయో పంటలను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడ్డాయనేది వివరణాత్మకంగా ప్రదర్శిస్తున్నారు.