
634views
-
సరిహద్దుల్లో డ్రోన్ కలకలం
-
కాల్పులు జరిపిన భారత భద్రతా దళాలు
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ డ్రోన్ తిరగడాన్ని గుర్తించిన భద్రతా దళాలు దానిపై కాల్పులు జరిపాయి. దీంతో అవి పాక్వైపు వెళ్లిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అమృత్సర్ జిల్లాలోని బిందీ సైదాన్ గ్రామంలో డ్రోన్ను గుర్తించిన భద్రతా సిబ్బంది.. ఏమైనా పేలుడు పదార్థాలను కిందకు విడిచాయా? అన్నకోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనూ పంజాబ్లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం రేపాయి. కొన్నినెలలుగా సరిహద్దుల్లో డ్రోన్లు సంచరించటం వల్ల అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.





