News

తాలిబన్లు భారత్ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు

456views
  • యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాలిబన్లకు హెచ్చరిక జారీ చేశారు. తాలిబాన్ల ఆగడాలతో పాకిస్థాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌ దేశాలు కలవరపడుతున్నాయని, అయితే తాలిబన్లు భారత్‌ వైపు వచ్చేందుకు సాహసిస్తే వైమానిక దాడికి తాము సిద్ధమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హెచ్చరించారు. లక్నో నగరంలో జరిగిన సామాజిక ప్రతినిధుల సమ్మేళనంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ రాష్ట్రంలోని తన రాజకీయ ప్రత్యర్థులపై కూడా దాడికి దిగారు.

మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా ఉంది. ఏ దేశమూ భారత్‌ వైపు దృష్టి సారించే సాహసం చేయలేకపోతోంది. తాలిబన్లు భారత్ వైపు వస్తే తాము వైమానిక దాడికి సిద్ధంగా ఉన్నామని యోగి హెచ్చరించారు. త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్షాలపై విమర్శల దాడి పెంచారు. యూపీ అభివృద్ధితో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు సంబంధం లేదని సీఎం అన్నారు. రామభక్తులను హత్య చేసిన వారికి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పే ధైర్యం ఉందా అని ఎస్పీ పేరు చెప్పకుండా ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి