News

నక్కిన తీవ్రవాదుల కోసం ముమ్మర వేట!

677views

కశ్మీర్‌: పూంచ్‌ అడవుల్లో నక్కిన తీవ్రవాదుల కోసం భారత భద్రతా దళాలు ముమ్మంగా వేట కొనసాగిస్తున్నాయి. సుమారు నాలుగు వేల మంది జవాన్లు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నెలలో తొమ్మిది మంది భారత సైనికులు కశ్మీర్‌లో వీరమరణం పొందినప్పటి నుండి, ఉగ్రశక్తులను నాశనం చేయడానికి లోతైన అడవుల్లోకి సైన్యం ప్రవేశించింది. పగలు, రాత్రి అనక ముందుకు వెళుతున్నారు. సైనికులు అడవి శివార్లలోకి ప్రవేశించారు. ఆర్మీ బృందం ఈ అడవిలోకి ప్రవేశించి దాదాపు ఎనిమిది రోజులు అయ్యింది.

ఇప్పటివరకు ఉగ్రవాదుల జాడ దొరకలేదు. అయితే, అడవిలో దాక్కున్న ఉగ్రవాదులను నిర్మూలించకుండా ఆర్మీ సిబ్బంది తిరిగిరాదని అంటున్నారు. పూంచ్‌ అడవులలో 11 రోజులుగా సెర్చ్‌ ఆపరేషన్‌ జరుగుతోంది. అడవి చాలా దట్టమైనది. పలు జాగ్రత్తలు తీసుకొని, జవాన్లు ముందుకు కదులుతున్నారు. జవాన్లు అడవి లోపల, వెలుపల ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు. వారందరూ తమ తోటి సైనికుల హత్యకు ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా భావించి తుపాకీలతో గాలిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Source: Kreatelywebsite

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి