
-
ఒకరి అరెస్టు
ఢిల్లీ: నవరాత్రుల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో అష్రఫ్ అలీ అనే పాకిస్తానీ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది దగ్గర నుండి ఏకే 47, ఇతర ఆయుధాలు, భారీగా బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ను పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా పర్యవేక్షిస్తున్నారు. అష్రఫ్ అలీ పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందినవాడని తెలుస్తోంది. భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతూ లక్ష్మీనగర్లోని రమేష్ పార్క్ ప్రాంతంలో ఉంటున్నాడు. ఆ ఉగ్రవాదిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంతోపాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. పండుగల సమయంలో భారత్లో అలజడి సృష్టించాలని తీవ్రవాదులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేశంలోని పలు నగరాల్లో పోలీసులు సెక్యూరిటీని మరింత పెంచారు.
Source: NationalistHub





