
547views
-
దుబాయ్ ఎక్స్పోలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారత్ స్వర్గధామం లాంటిదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రారంభమైన దుబాయ్ ఎక్స్పో ఆయన మాట్లాడారు. యూఏఈ, దుబాయ్లతో భారత్కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. భారత్ అవకాశాలకు వేదిక అని.. అన్ని రంగాల అభివృద్ధికి, పెట్టుబడులకు సరైన దేశమని పేర్కొన్నారు.





