
కేరళలో హిందూ వ్యతిరేక శక్తులు స్థానిక సాంస్కృతిక చిహ్నాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న మరొక సంఘటన వెలుగులోకొచ్చింది. డ్రిల్లింగ్ మెషిన్ మరియు రసాయనాలను ఉపయోగించి మఱ్ఱి చెట్టును చంపే ప్రయత్నం చేశారు.
శతాబ్దాల నాటి మఱ్ఱి చెట్టు కేరళలోని ముక్కం ప్రజల మత జీవితంలో అంతర్భాగం. భక్తులు చెట్టు ఆకులు ఎండిపోవడాన్ని గమనించి పరిశీలించగా ఆ చెట్టుకు పెద్ద రంధ్రం ఉండడాన్ని గుర్తించారు. అక్కడే రసాయనాలను కూడా కనుగొన్నారు.
స్థానిక హిందువులు దీనిలో ముస్లిం మత ఛాందసవాదుల పాత్ర ఉన్నదని అనుమానిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తాము ఆ చెట్టును పతనం కానివ్వమని, ఏం చేసయినా సరే ఆ చెట్టును కాపాడుకుంటామని వాళ్ళు తెలిపారు. కురుక్షేత్ర సంస్కార వేదిక కార్యకర్తలు దాని పక్కనే మరొక మొక్కను నాటారు. పవిత్రమైన, పురాతనమైన చెట్టుపై మత ఛాందసులు దాడికి పాల్పడడాన్ని కురుక్షేత్ర సంస్కార వేదిక నిరసించింది. స్థానిక హిందువులు పోలీసులు, అటవీ మరియు మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Source : Organiser.





