News

మతం మత్తులో కన్న కొడుకుని అల్లాకి బలిచ్చింది

669views

భ్య సమాజం తలదించుకునే విధంగా మతం మత్తులో దారుణానికి పాల్పడింది ఓ మహిళ. ‘అల్లాహ్ అనుగ్రహం’ కోసం అభంశుభం తెలియని కన్న కొడుకుని బలిచ్చింది. ఈ హృద‌య విదార‌క‌ ఘట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. సులేమాన్‌, షాహిదా దంప‌తులు తమ ముగ్గురు పిల్లలతో కేరళ రాష్ట్రం పాలక్కా‌డ్ ‌లో నివ‌సిస్తున్నారు. సులేమాన్ ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తుండగా షాహిదా ఇస్లామిక్ పాఠశాల (మ‌ద‌ర్సా)లో బోధకురాలిగా ప‌నిచేస్తోంది. నిత్యం ఖురాన్ బోధించే షాహిదా తీవ్రమైన మూఢనమ్మకాలకు లోనైంది. ఈ క్ర‌మంలో “అల్లాహ్ అనుగ్రహం కోసం” తన ఆరేళ్ళ కొడుకుని బలిచ్చింది. ఇంట్లో భ‌ర్త, పిల్ల‌లు నిద్రిస్తుండ‌గా త‌న కొడుకుని బాత్రూంలోకి తీసుకెళ్లి అతి కిరాత‌కంగా గొంతు కోసి చంపేసింది.

ఘటన అనంతరం విష‌యాన్ని ఆమే స్వ‌యంగా పోలీసుల‌కు ఫోన్ చేసి స‌మాచార‌మివ్వ‌డం గ‌మ‌నార్హం. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్నిప‌రిశీలించారు. “అల్లా‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలోనే ఈ పని చేశాను” అని షాహిదా పోలీసులకు తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు ఐపీసీ సెక్షన్ 302 కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వనాధ్ మాట్లాడుతూ, నిందితురాలు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామ‌ని, ఘ‌ట‌న‌పై సమగ్ర దర్యాప్తు చేప‌ట్టి తద్వారా హత్యలో కారణాలు విశ్లేషించి నిర్ధారించగలమ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో పాలక్కా‌డ్ ‌లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి.

Source :  ORGANISER & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.