397
కలియుగదైవం శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే అర్ధంతరంగా నిలిపివేసింది. తిరుపతిలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 30వరకు టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమిళ పరిటాసి మాసం కావడంతో తమిళనాడు సహా ఇతర ప్రాంతాల నుంచి రేపటి సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. వారంతా తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూ లైన్లలోనే వేచి ఉన్నారు. టికెట్లు జారీ చేయడం లేదని తితిదే ప్రకటించినా అక్కడి నుంచి వెళ్లడం లేదు.