8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం
నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్లోని రాజ్గర్లో నూతన నలంద విశ్వవిద్యాలయ...





