రాష్ట్రవ్యాప్తంగా కిటకిటలాడిన శైవక్షేత్రాలు
మహా శివరాత్రి ఘడియల్లో రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడాయి. శ్రీశైలం, కోటప్పకొండతోపాటు, పంచారామ క్షేత్రాల్లో లింగరూపధరుడైన మహాశివుని దర్శించి భక్తులు పులకించిపోయారు. హరోం..హరా.. శంభో శివ శంకరా అంటూ శివనామస్మరణ చేశారు. శ్రీశైలంలో మల్లికార్జున, భ్రమరాంబికాదేవి కల్యాణ మహోత్సవం శుక్రవారం కన్నుల పండువగా...







