News

News

వైభవంగా వేణుగోపాల స్వామి రథోత్సవ వేడుకలు

వైయస్సార్ జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి వారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తిరు ణాల గురువారం సాయంత్రం ముగిసింది. రథోత్సవ వేడుకల సందర్భంగా రథంలో వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తుల విగ్రహాల ను శుభముహుర్తాన వేద పండితు లు అధిష్టింపచేశారు. ఈ సందర్భం గా భక్తులు గోవింద నామస్మరణలతో మార్మోగుతూ రథాన్ని ముందుకు కదిలించారు. మధ్యాహ్నం కొంత దూరం వరకు లాగి నిలిపి సాయంత్రం మళ్ళీ రథాన్ని యథాస్థానానికి లాగారు. ఈ తిరుణాలకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటుగా కర్నాటకకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా గురువారం రాత్రి గరుడోత్సవ వేడుకలను నిర్వహించి స్వామి వారికి పూజలు చేశారు. తిరుణాలకు వచ్నిన భక్త్తులకు ఆలయ కమిటీ సిబ్బంది ఏర్పాట్లను చేపట్టారు....
News

మే 21 నుంచి ఉత్తరాఖండ్‌ రిషికేష్‌లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రిషికేష్‌లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలునిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మే 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 20సేనాధిప‌తి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉద‌యం 7.30 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారి వాహ‌న సేవ‌లు నిర్వహిస్తామని వెల్లడించారు....
News

చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం..

కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం శుక్రవారం రాత్రి చెన్నై వాసులను కనువిందు చేసింది. నిశీధిలో మిలమిలా మెరుస్తూ కన్పించడంతో ప్రజలు ఆశ్చర్యపడ్డారు. కొందరు ఆ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించి నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మే 8 నుంచి 23వ తేదీ మధ్యలో భారత్‌లోని పలు నగరాల ప్రజలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కన్పిస్తుందని ఇటీవల నాసా వెల్లడించింది. ‘‘ప్రస్తుతం సూర్యుడి కాంతి దీని మీద ప్రతిబింబించడంతో ఈ స్పేస్‌ స్టేషన్‌ భారత వాసులకు కన్పించనుంది. సాధారణంగా చంద్రుడు కూడా మనకు ఇలాగే కన్పిస్తాడు. అయితే, జాబిల్లి అంత ప్రకాశవంతంగా ఉండకపోవడంతో పగటిపూట అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై నుంచి మనం గుర్తించలేం. అదే రాత్రివేళల్లో అయితే మెరుస్తూ కన్పిస్తుంది. కొన్ని...
News

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ నేవీ

ఇంటర్ పూర్తి చేసిన వారికి భారత నావికాదళం శుభవార్త చెప్పింది. అగ్నివీర్ పోస్టుల నియామక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ పూర్తిచేసిన అవివాహిత స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 13 న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి, రెండు...
News

కొన్ని విషయాల్లో అమెరికన్ల కన్నా భారతీయులే మెరుగు : అమెరికా రాయబారి

భారత్ , అమెరికా సంబంధాలు 21 వ శతాబ్దంలో కీలక పాత్ర పోషించనున్నాయి. స్వేచ్ఛాయుత , న్యాయపరమైన ఎన్నికల విధానంతో వచ్చే పదేళ్లలో భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా మారనుంది. అక్కడ చట్టాలు బలంగా వున్నాయి. కొండ ప్రాంతాల్లో వుండే వారిని కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు అధికారులు కాలినడకన ఈవీఎంలను తీసుకొని వెళ్తారు. నగదు పంపిణీని అడ్డుకునేందుకు వాహనాల తనిఖీ వుంది. రాజకీయంగా ధైర్యంగా విమర్శలు చేసే పరిస్థితి అక్కడ వుంది . అందరి హక్కులనూ గౌరవిస్తుంటారు. కొన్ని విషయాల్లో అమెరికన్ల కన్నా భారతీయులే మెరుగ్గా వున్నారు. భారతనతో సంబంధాలపై పరిపూర్ణ విశ్వాసాన్ని వుంచుతున్నాం.-అమెరికా రాయబారి ఎరిక్ గర్సేట్టి...
ArticlesNews

”త్వంహి దుర్గా దశప్రహరణ ధారిణీ” సాంకేతిక భారతం

( మే 11- జాతీయ సాంకేతిక దినోత్సవం ) భార‌త సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిది. దీన్నే పోఖ్రాన్-II అంటారు. దీనిలో భారత్ విజయాన్ని...
News

కేదార్ నాథ్ ఆలయం దర్శనం ప్రారంభం గంగోత్రి, యమునోత్రి కూడా

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంది. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అధికారులు ఉదయం 7 గంటలకు ప్రధాన ద్వారాలు తెరిచారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ కుటుంబ సమేతంగా తొలి పూజలకు హాజరయ్యారు. ఈ రోజే ఆలయం...
ArticlesNews

వేలఏళ్లుగా తుప్పు పట్టని పరశురాముడి గండ్రగొడ్డలి.. తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

పురాణాల విశ్వాసాల ప్రకారం పరశురాముని గొడ్డలి ఇప్పటికీ భూమిపై, గొడ్డలిని భూమిలో పాతిపెట్టిన ప్రదేశం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లో ఉంది. తంగినాథ్ ధామ్ జార్ఖండ్ రాజధాని రాంచీకి 150 కిలోమీటర్ల దూరంలో జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లోని లుచుట్‌పట్ కొండలపై ఉంది.జార్ఖండ్ స్థానిక గిరిజన భాషలో, గొడ్డలిని టాంగి అంటారు. అందుకే ఈ ప్రాంతానికి తంగినాథ్ ధామ్ అని పేరు వచ్చింది.తంగినాథ్ ధామ్‌లో రాళ్లతో నిర్మించిన పురాతన ఆలయం. దీనితో పాటు శివయ్యకు చెందిన 108 శివలింగాలతో పాటు బహిరంగ ప్రదేశంలో ఆకాశం క్రింద ఇతర దేవుళ్ల పురాతన రాతి విగ్రహాలు ఉన్నాయి. భూమిలో పాతిపెట్టిన గొడ్డలి తన తల్లిని చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి పరశురాముడు తంగినాథ్ ధామ్‌లో భారీ త్రిశూలం ఆకారంలో ఉన్న గొడ్డలిని భూమిలో పాతిపెట్టి కఠినమైన...
1 1,493 1,494 1,495 1,496 1,497 3,061
Page 1495 of 3061