ArticlesNews

వేలఏళ్లుగా తుప్పు పట్టని పరశురాముడి గండ్రగొడ్డలి.. తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

313views

పురాణాల విశ్వాసాల ప్రకారం పరశురాముని గొడ్డలి ఇప్పటికీ భూమిపై, గొడ్డలిని భూమిలో పాతిపెట్టిన ప్రదేశం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లో ఉంది.

తంగినాథ్ ధామ్ జార్ఖండ్ రాజధాని రాంచీకి 150 కిలోమీటర్ల దూరంలో జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లోని లుచుట్‌పట్ కొండలపై ఉంది.జార్ఖండ్ స్థానిక గిరిజన భాషలో, గొడ్డలిని టాంగి అంటారు. అందుకే ఈ ప్రాంతానికి తంగినాథ్ ధామ్ అని పేరు వచ్చింది.తంగినాథ్ ధామ్‌లో రాళ్లతో నిర్మించిన పురాతన ఆలయం. దీనితో పాటు శివయ్యకు చెందిన 108 శివలింగాలతో పాటు బహిరంగ ప్రదేశంలో ఆకాశం క్రింద ఇతర దేవుళ్ల పురాతన రాతి విగ్రహాలు ఉన్నాయి.

భూమిలో పాతిపెట్టిన గొడ్డలి
తన తల్లిని చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి పరశురాముడు తంగినాథ్ ధామ్‌లో భారీ త్రిశూలం ఆకారంలో ఉన్న గొడ్డలిని భూమిలో పాతిపెట్టి కఠినమైన తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. పరశురాముని తపస్సుకి మెచ్చి శివుడు తంగినాథ్ ధామ్‌లో ప్రత్యక్షమయ్యాడు. మాతృహత్య పాపం నుంచి పరశురాముడికి విముక్తిని ఇచ్చాడు.పురాణ గ్రంధాల ప్రకారం త్రిశూల ఆకారపు గొడ్డలి (టాంగి) తంగినాథ్ ధామ్‌లో ఖననం చేయబడింది.

1984లో తంగినాథ్ ధామ్‌లో గొడ్డలి రహస్యాన్ని తెలుసుకోవడానికి త్రవ్వకాలు జరిగాయి. 15 అడుగులకు పైగా మట్టిని తవ్వినా భూమిలో పాతిపెట్టిన గొడ్డలి చివరి భాగం కనిపించలేదు. భూమికి దాదాపు 5 అడుగుల ఎత్తులో త్రిశూల ఆకారపు గొడ్డలి ఉంది. వేలాది సంవత్సరాలుగా బహిరంగ ప్రదేశంలో ఉంది. చలి, వేడి, వర్షంలో తడుస్తూ ఉన్న ఈ త్రిశూలం ఆకారంలో ఉన్న ఇనుప గొడ్డలి (టాంగి) నేటికీ తుప్పు పట్టలేదు.