వైయస్సార్ జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి వారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తిరు ణాల గురువారం సాయంత్రం ముగిసింది. రథోత్సవ వేడుకల సందర్భంగా రథంలో వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తుల విగ్రహాల ను శుభముహుర్తాన వేద పండితు లు అధిష్టింపచేశారు. ఈ సందర్భం గా భక్తులు గోవింద నామస్మరణలతో మార్మోగుతూ రథాన్ని ముందుకు కదిలించారు. మధ్యాహ్నం కొంత దూరం వరకు లాగి నిలిపి సాయంత్రం మళ్ళీ రథాన్ని యథాస్థానానికి లాగారు. ఈ తిరుణాలకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటుగా కర్నాటకకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా గురువారం రాత్రి గరుడోత్సవ వేడుకలను నిర్వహించి స్వామి వారికి పూజలు చేశారు. తిరుణాలకు వచ్నిన భక్త్తులకు ఆలయ కమిటీ సిబ్బంది ఏర్పాట్లను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత దీపాలతో అలంకరించిన చాందినీ బండ్లను ఊరేగించి భక్తులు స్వామి వారిని దర్శించుకుని తలనీలాలను సమర్పించారు.
226views
You Might Also Like
అస్సాం వరదల బాధితులకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం
20
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు.
26
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం
రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం:...
గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో
37
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’
34
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర
36
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...




