వైయస్సార్ జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి వారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తిరు ణాల గురువారం సాయంత్రం ముగిసింది. రథోత్సవ వేడుకల సందర్భంగా రథంలో వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తుల విగ్రహాల ను శుభముహుర్తాన వేద పండితు లు అధిష్టింపచేశారు. ఈ సందర్భం గా భక్తులు గోవింద నామస్మరణలతో మార్మోగుతూ రథాన్ని ముందుకు కదిలించారు. మధ్యాహ్నం కొంత దూరం వరకు లాగి నిలిపి సాయంత్రం మళ్ళీ రథాన్ని యథాస్థానానికి లాగారు. ఈ తిరుణాలకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటుగా కర్నాటకకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా గురువారం రాత్రి గరుడోత్సవ వేడుకలను నిర్వహించి స్వామి వారికి పూజలు చేశారు. తిరుణాలకు వచ్నిన భక్త్తులకు ఆలయ కమిటీ సిబ్బంది ఏర్పాట్లను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత దీపాలతో అలంకరించిన చాందినీ బండ్లను ఊరేగించి భక్తులు స్వామి వారిని దర్శించుకుని తలనీలాలను సమర్పించారు.
214views
You Might Also Like
అయోధ్య ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్
27
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియమితులయ్యారు. విరాళాల దుర్వినియోగం నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చేసిన...
వక్ఫ్ బోర్డులో హిందువులు… మధ్యప్రదేశ్ సంచలన నిర్ణయం
32
మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే రికార్డు నమోదు చేసింది. దేశంలోనే తొలి సారిగా ఓ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందువులకు చోటు కల్పించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి డాక్టర్...
పాక్ విఫల దేశంగా మారే అంచున ఉంది.. సింగపూర్ మాజీ రాయబారి
44
ఇరాన్తో ఉద్రిక్తతలను తగ్గించడంలో మధ్యవర్తిత్వం వహించి పాకిస్థాన్ అమెరికా దగ్గర కొన్ని మార్కులు కొట్టేసింది. అయితే ఈ దౌత్య చర్యల వల్ల పాక్ ప్రజల సమస్యలు పరిష్కారం...
కేరళ వర్సిటీల నుంచి శతాబ్దాల నాటి తాళపత్ర గ్రంథాల మాయం..
38
కేరళ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానానికి సంబంధించిన ఎంతో విలువైన శతాబ్దాల నాటి తాళపత్ర గ్రంథాలుకేరళ విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం ఆర్కైవ్స్ నుంచి మాయమయ్యాయి. తిరువనంతపురంలోని మాన్యుస్క్రిప్ట్...
సీలేరు అటవీ ప్రాంతంలో 10 వేల విత్తన బంతుల వెదజల్లింపు
60
అడవులను సంరక్షించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించవచ్చని అల్లూరి సీతారామరాజు జల్లా సీలేరు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ సతీష్...
ఉమర్ ఖాలిద్కు బెయిల్ నిరాకరణ
31
దిల్లీ అల్లర్ల కేసు 2020లో అరెస్టయి జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్ షర్జీల్ ఇమామ్కు దిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ గతంలో సుప్రీంకోర్టు...





