News

పాతబస్తీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్తత

375views

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుంది. చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలను చేత పట్టుకుని నిరసన తెలిపారు. మదీన, అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ కూడలిలో గుంపులుగా చేరిన పలువురు కూడళ్ల వద్ద వాహనాలను నిలిపి నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేశారు.

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ఆందోళనకారులు విధ్యంసానికి పాల్పడకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నిరసనకారులు ఆందోళన కొనసాగించారు. మరో వైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇతరులెవరు ఆయన ఇంటి వైపు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి