News

ఉగ్రవాదంలో మహిళలు!

582views
  • కశ్మీర్‌ లోయలోని భద్రతా బలగాలకు స‌రికొత్త సవాలు

న్యూఢిల్లీ: కశ్మీర్‌ లోయలోని సాఫ్ట్‌ టార్గెట్‌లపై దాడి చేస్తున్న ఉగ్రవాదులను ఖ‌తం చేసేపనిలో ఇప్పటికే బిజీగా ఉన్న భద్రతా బలగాలకు స‌రికొత్త స‌వాల్ ఎదురైంది. తాజాగా ఇక్కడి తీవ్ర‌వాదంలో మ‌హిళ‌లు కూడా పాలుపంచుకుంటున్నారు.

పాక్ ఆక్రమిత J&K (POJK) నియంత్రణ రేఖ (LOC) నుండి శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడుతున్న ఉత్తర క‌శ్మీర్‌లో కొన్ని రోజులుగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు వెలుగులోకి వ‌చ్చారు.

పక్షం రోజుల క్రితం సోపోర్ పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డుపై ఉన్న సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై బురఖా ధరించిన మహిళ గ్రెనేడ్ విసురుతుండగా సీసీటీవీలో రికార్డయింది. తౌహీదాబాద్ బాగ్‌కు చెందిన షీమా షఫీ వాజాగా పోలీసులు గుర్తించిన మహిళ, ఓవర్‌గ్రౌండ్ వర్కర్ (OGW)గా ఉగ్రవాదంలో నిమగ్నమై ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) హ్యాండ్లర్లు ఆమెకు వై-ఫై హాట్‌స్పాట్, వసతి కల్పించడంతోపాటు ఉగ్రవాదులు ఎల్‌ఓసి మీదుగా చొరబడిన తర్వాత వారిని నిర్దేశించిన గమ్యస్థానానికి తీసుకెళ్ళే బాధ్యతను అప్పగించారు.

సెక్యూరిటీ బంకర్ వద్ద పెట్రోల్ బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయిన మ‌రో మ‌హిళ హసీనా అక్తర్‌ను సోపోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర క‌శ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన మహిళ తన ముఖాన్ని బురఖాతో ఈ నేరానికి పాల్ప‌డింది. ఇప్ప‌టికే ఆమెపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద మూడు ఎఫ్‌ఐఆర్‌లు న‌మోదైవున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నమోదు చేసిన తీవ్రవాద నిధుల కేసులో జైలులో ఉన్న అగ్రశ్రేణి మహిళా వేర్పాటువాది, పాకిస్తాన్ అనుకూలరాలు ఆసియా ఆంద్రాబీ ఆమెను ప్రేరేపించినట్టు నివేదించబడింది.

Source: The Statesman

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి