News

గుజరాత్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ

667views

గాంధీన‌గ‌ర్‌: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ ప్రతినిధి సభ గుజరాత్‌లోని కర్ణావతిలో జ‌ర‌గ‌నుంది. మూడు రోజులపాటు జ‌రుగు ఈ భైఠ‌క్‌లో మునుపటి పనులపై స‌మీక్ష ఉంటుంది. అలాగే, రాబోయే సంవత్సరాల్లో చేప‌ట్ట‌బోయే వివిధ ప‌నుల‌కు సంబంధించిన‌ ప్రణాళికలు, కార్యకలాపాలు ఖరారు చేయబడతాయి.

అఖిల భారతీయ ప్రచార‌ ప్రముఖ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ… ఈ సంవత్సరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్‌ఎస్‌) వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సభ శుక్రవారం, 11 మార్చి 2022 నుండి మార్చి 13, ఆదివారం వరకు గుజరాత్‌లోని కర్ణావతిలో జరగనుంది. ఈ స‌భ‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. సంఘ్‌ నిర్ణయాత్మక దృక్కోణం దృష్ట్యా రాబోయే సంవత్సరాల్లో వివిధ ప్రణాళికలు, నిర్ణయాలు కూడా ఖరారు చేయబడతాయ‌న్నారు. అలాగే, కొవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రించి, స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

గత సంవత్సరం కార్యకలాపాల నివేదికలు, శిక్షా వర్గ్, రాబోయే సంవత్సరపు పని విస్తరణ ప్రణాళికతోపాటు సందర్భోచిత ప్రస్తుత విష‌యాలు చర్చించబడతాయి… కొన్ని సమస్యలపై తీర్మానాలు కూడా ఉంటాయ‌ని అంబేకర్ చెప్పారు.

స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్, స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే, ఇత‌ర స‌హ స‌ర్ కార్య‌వాహ‌లు కృష్ణగోపాల్, మన్మోహన్ వైద్య, ముకుంద్, రామ్‌దత్, అరుణ్ కుమార్, సంఘ్ ఇత‌ర ప్ర‌తినిధులు హాజరుకానున్నారు. ఎన్నికైన జోన‌ల్‌, ప్రాంత స్థాయి సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారక్‌లు, అఖిల భారతీయ సంఘటన్ మంత్రులతో పాటు వివిధ సంఘ్ నుంచి స్ఫూర్తి పొంది, ఆవిర్భ‌వించిన సంస్థల ప్రతినిధులు అందరూ కూడా హాజరుకానున్నారు.

Source: rss.org

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి