News

‘హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్’

548views

ఒంగోలు: హిందూ ద్రోహి మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో గోడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని, చర్చి నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ బీజేపీ మహిళల నాయకత్వంలో ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జ‌రిగింది.

రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి సాధినేని యామిని శర్మ, ఒంగోలు పార్లమెంటు జిల్లా బీజేపీకి అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. సాధినేని యామిని శర్మ మాట్లాడుతూ పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామంలో వెలసిన గోడ్రాలి కొండ తిరుమల స్వామి దేవాలయం దగ్గర అక్రమంగా ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రకాశం కలెక్టర్‌కు బీజేపీ ఒంగోలు పార్లమెంటు కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించారు. హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా కొంతమంది అన్యమతస్తులు గొడ్రాలు కొండపై అన్యమత చిహ్నాలు అక్రమంగా అనుమతిలేకుండా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని వారు మండిప‌డ్డారు. గొడ్రాలి కొండపై శిలువను పెట్టిన అందరి పై కేసులు పెట్టాలని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మంత్రి సురేష్ వెంటనే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

Source: NijamToday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి