News

బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు!

622views
  • మాన‌వ అక్ర‌మ ర‌వాణా గుట్టు ర‌ట్టు

  • ఛేదించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఏటీఎస్‌

  • 9 మంది నిందితుల అరెస్టు

ల‌క్నో: బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇచ్చి విదేశాలకు పంపిన మానవ అక్రమ రవాణా రాకెట్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలతో నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అసిదుల్ ఇస్లాం, హుస్సేన్ మహ్మద్, అలమీన్ అహ్మద్, జైబుల్ ఇస్లాం, జమీల్ అహ్మద్, రాజీవ్ హుస్సేన్, షెకావత్ ఖాన్‌, అల్లాదీన్ తారిఖ్‌లుగా గుర్తించబడిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు ఏటీఎస్ ప్రాథమికంగా తెలియజేసింది. వీరిని విచారించిన తర్వాత యుపీ ఏటీఎస్ లక్ష రూపాయలు తీసుకున్న మహఫుజుర్ రెహ్మాన్‌ను కూడా అరెస్టు చేసింది. నిందితుల నుంచి ఒక్కొక్కరి నుంచి డబ్బులు వసూలు చేసి హిందూ పేర్లతో నకిలీ భారతీయ పత్రాలను అందించారు.

ఏటీఎస్ అధికారులు మాట్లాడుతూ “బంగ్లాదేశ్ పౌరులు అందించిన సమాచారం మేరకు, ఏటీఎస్ సోమవారం 24 పరగణ కోల్‌కతాలోని మదర్సా నుండి మహ్ఫుజుర్ రెహ్మాన్ (34)ని అరెస్టు చేసింది. రెహ్మాన్ కూడా బంగ్లాదేశ్ జాతీయుడే. అతను ఫేక్ ఐడితో భారత్‌లో నివసిస్తున్నట్టు తేలింది. అతన్ని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తీసుకువస్తున్నారు. రాకెట్‌తో సంబంధం ఉండి దేశంలో చురుకుగా ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి