News

20 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించిన వాట్సాప్

527views

న్యూఢిల్లీ: వాట్సాప్ 20 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. వీటిపై సంస్థకు 500 ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. వేధింపులను అరికట్టడం సహా యూజర్ల భద్రత కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు వివరించింది. 95 శాతానికి పైగా ఖాతాలను బల్క్​ మెసేజింగ్​ను దుర్వినియోగం చేసినందువల్లే బ్యాన్ చేసినట్టు వాట్సాప్ తెలిపింది. ఈ వేదికపై వేధింపులను అరికట్టేందుకు నెలవారీగా సుమారు 80 లక్షల ఖాతాలను నిషేధిస్తోంది వాట్సాప్. సెప్టెంబర్​లోనూ 560 ఫిర్యాదు నివేదికలు అందగా, 22 లక్షల భారతీయుల ఖాతాలను నిలిపేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి