News

విశాఖలో దక్షిణ భారత యువ నైపుణ్యాభివృద్ధి పోటీలు

514views

విశాఖ‌ప‌ట్నం: దక్షిణ భారతదేశంలోని యువతకు నైపుణ్య పోటీలు విశాఖలోని ఏయూ కన్వెన్షన్‌ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి యువత పాల్గొన్నారు. థింసా నృత్యం ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు.

2019లో రష్యాలో జరిగిన పోటీల్లో ‘మెడలియన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ’ అవార్డు పొందిన కోటేశ్వరరెడ్డి యువత తో ‘అంకితభావంతో పోటీల్లో పాల్గొంటానని, మోసం చేయనని, మంచి ప్రతిభ కనబరుస్తానని, మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తా’నని ప్రతిజ్ఞ చేయించారు. వారికి నగరంలోని 11 కేంద్రాల్లో, 52 విభాగాల్లో పోటీలు నిర్వహించి ఈనెల నాలుగో తేదీన విజేతలకు బహుమతులు అందజేస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి