
బెంగళూరు: బెంగళూరు ఎయిర్పోర్ట్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేగింది. విమానం దిగిన ఇద్దరు దక్షిణ ఆఫ్రికా దేశస్థులకు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వాళ్లను వెంటనే క్వారంటైన్కు తరలించారు. వారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉందో లేదో టెస్ట్ చేసేందుకు వాళ్ల శాంపిల్స్ను ల్యాబ్కు పంపించినట్టు బెంగళూరు రూరల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. మరో 48 గంటల్లో టెస్ట్ రిజల్ట్స్ వస్తాయని ఆయన తెలిపారు.
దీనితో వివిధ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్ట్లు తప్పనిసరి చేసింది. విదేశీ ప్రయాణికులకు వారం తప్పనిసరి క్వారంటైన్ నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
దక్షిణాఫ్రికాతోపాటు బోట్స్వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి వచ్చిన వారి వద్ద కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నా మళ్లీ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. క్వారంటైన్ సమయం ముగిసిన తర్వాత మళ్లీ నెగెటివ్ వచ్చిన తర్వాత బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది.
Source: Nijamtoday





