News

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

667views

లాంగ్డింగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. మణిపూర్‌లోని మయన్మార్‌ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్‌ దంపతులు సహా ఎనిమిదేళ్ల కుమారుడు, ఐదుగురు సైనికులు శనివారం మరణించిన విషయం విదితమే. ఈ ఉగ్రదాడి అనతరం అస్సాం రైఫిల్స యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద గ్రూపు నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌-ఖప్లాంగ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌`కే`వైఏ) యుంగ్‌ ఆంగ్‌ వర్గానికి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్‌ జిల్లాలోని ఖోగ్లా వద్ద సోమవారం భారత్‌-మయన్మార్‌ సరిహద్దు ప్రాంతంలో అస్సాం రైఫిల్స్‌- ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గరు హతమైనట్లు అధికారులు వెల్లడిరచారు. ఉదయం ఎనిమిది గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని ఖోన్సా అస్సాం రైఫిల్స్‌ కమాండిరగ్‌ ఆఫీసర్‌ ప్రకటించారు. కాగా.. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. సాయుధ బలగాల్లో ఎవరైనా గాయపడ్డారా..? లేదా అనే దానిపై స్పష్టత రాలేదు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి