
680views
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫొండేషన్పై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిన్తున్నట్టు కేంద్రం హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. జకీర్ నాయక్ ప్రకటనలు, ప్రసంగాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. జకీర్ నాయక్ ప్రసంగాలు భారత్లో, విదేశాల్లో ఒక నిర్దిష్ట మతానికి చెందిన యువత ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్టు స్పష్టంచేసింది.





